మహేశ్ బాబుకు అరుదైన గౌరవం.. టుస్సాడ్స్‌లో కొలువుదీరనున్న టాలీవుడ్ సూపర్ స్టార్!

  • ప్రతిష్ఠాత్మక టుస్సాడ్స్ మ్యూజియంలో మహేశ్ మైనపు విగ్రహం
  • కొలతలు తీసుకునేందుకు వచ్చిన టుస్సాడ్స్ ప్రతినిధులు
  • ట్విట్టర్ ద్వారా వెల్లడించిన మహేశ్ బాబు
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. ప్రతిష్ఠాత్మక మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు విగ్రహాన్ని పెట్టనున్నారని మహేశ్ స్వయంగా వెల్లడించాడు. ఈ మేరకు ట్వీట్ చేశాడు. టుస్సాడ్స్ మ్యూజియంలో తన మైనపు బొమ్మను ఏర్పాటు చేసేందుకు వివరాల సేకరణ కోసం టుస్సాడ్స్ ప్రతినిధులు వచ్చినట్టు చెప్పిన మహేశ్ ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపాడు.

అయితే మహేశ్ మైనపు బొమ్మను ఢిల్లీలో పెడతారా? లేక, బ్యాంకాక్‌లో పెడతారా? అన్న విషయంలో స్పష్టత లేదు. మేడమ్ టుస్సాడ్స్‌లో ఇప్పటి వరకు చోటు దక్కించుకున్న ఒక్కే ఒక్క తెలుగు నటుడు ప్రభాస్ కాగా, ఇప్పుడు మహేశ్ బాబు కూడా ఆ సరసన చేరనున్నాడు. ‘భరత్ అనే నేను’ సినిమా విడుదలై సంచలనాలు నమోదు చేస్తుండడంతో మహేశ్ పుల్ ఖుషీగా ఉన్నాడు. ఇప్పుడు ఈ వార్త మహేశ్‌ను మరింత ఉబ్బితబ్బిబ్బయ్యేలా చేస్తోంది.
Go Back to Shorts
Mahesh Babu
Tollywood
Madam Tussauds
Prabhas

More Telugu News